షాద్నగర్, మే17: కొవిడ్ బాధితులకు అందించే సేవల ఖర్చు రోజుకు రూ.20 వేలకు మించరాదని ఎమ్మె ల్యే వై.అంజయ్య యాదవ్ ప్రైవేట్ వైద్యులకు సూచించారు. సోమవా రం పట్టణంలోని తన క్యాంపు కా ర్యాలయంలో పట్టణ ప్రైవేట్ వైద్యులతో కొవిడ్ వైద్య సేవలపై సమీక్ష సమావేశం నిర్వ హించి వైద్య సేవల ధరలు నిర్ణయించారు. రోజువారీగా వెంటి లేటర్ సేవలకు రూ.20 వేలు, ఆక్సిజన్ సేవలకు రూ.10 వేలు గా ధరలకు వైద్యులు అంగీకరించారని చెప్పారు. దీంతో బాధితులకు భారం తప్పనున్నదని వివరించారు. కొవిడ్ వైద్యానికి అవసరమయ్యే అన్ని మౌలిక వసతులు అందు బాటులో ఉంచాలన్నారు. బాధితులను భయభ్రాంతులకు గురిచేయవద్దన్నారు. కొవిడ్ ప్రొఫైల్ ధర గతం లో రూ.14 వేలుగా వసూలు చేసేవారని, ఇకపై రూ.5 వేలు తీసుకోవాలని కోరారు. ఆర్టీపీసీఆర్ పరీక్షకు రూ.800 మించరాదని ఆదేశిం చారు. ఈ తరుణంలో పేదలకు అండగా నిలువాలని కోరారు. ప్రైవేట్ వైద్యులు ధరలు తగ్గించేందుకు ముందుకురావడంపై కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ నరేం దర్, వైస్ చైర్మన్ ఎంఎస్. నటరాజన్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి పాల్గొన్నారు.