న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో పతకాలు సాధించిన భారత అథెట్లు, క్రీడాకారులకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నగదు బహుమతిని ప్రకటించింది. బంగారు పతకం విజేత నీరజ్ చోప్రాకు కోటి రూపాయలు, వెండి పతకం విజేతలు మీరాబాయి చాను, రవి కుమార్ దహియాకు ఒక్కొక్కరికి రూ.50 లక్షలు, కాంస్య పతకం విజేతలు పీవీ సింధూ, లోవ్లినా బోర్గోహైన్, బజరంగ్ పునియాకు రూ. 25 లక్షలు చొప్పున, హాకీ పురుషుల బృందానికి రూ.1.25 కోట్ల నగదును ఇవ్వనున్నట్లు శనివారం తెలిపింది.
మణిపూర్ ప్రభుత్వం కూడా నీరజ్ చోప్రాకు రూ.కోటి రివార్డును ప్రకటించింది. ఈ మేరకు కేబినెట్ నిర్ణయించినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ట్వీట్ చేశారు.
మరోవైపు నీరజ్ చోప్రాకు పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ రూ. 2 కోట్ల ప్రత్యేక నగదు బహుమతిని ప్రకటించారు. నీరజ్తో వీడియో కాల్లో మాట్లాడిన ఆయన, ఒలింపిక్స్లో దేశానికి తొలి బంగారు పతకం సాధించి భారత్ గర్వించేలా చేశారని కొనియాడారు.