కరోనా తర్వాత థియేటర్స్లోకి వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన చిత్రం ఉప్పెన. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి ప్రధాన పాత్రలలో బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించింది. 50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ముఖ్య పాత్ర పోషించి అలరించాడు.
ఉప్పెన సినిమా భారీ విజయం సాధించడంతో ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్ ను టాలీవుడ్ సినీ ప్రముఖులతో కలిసి చేసుకుంది. మెగా స్టార్ చిరంజీవి మొదలుకుని ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్స్ మరియు దర్శకులు మరియు నిర్మాతలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. చిరంజీవి, అల్లు అర్జున్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. ప్రేక్షకులతో సక్సెస్ వేడుక జరపాలని మేకర్స్ భావించినప్పటికీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ ఆలోచనను విరమించుకొని ప్రైవేట్ పార్టీగా వేడుక జరిపారు.