ఢాకా: శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ను బంగ్లాదేశ్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసుకొన్నది. శ్రీలంకతో సొంతగడ్డపై జరుగుతున్న వన్డే సిరీస్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది.
రెండో వన్డేలో ఆతిథ్య బంగ్లాదేశ్ డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 103 పరుగులతో విజయం సాధించి 2-0తో సిరీస్లో ఆధిక్యంలో నిలిచింది. దీంతో ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ సూపర్ లీగ్(ICC World Cup Super League) పాయింట్ల పట్టికలో బంగ్లాదేశ్ అగ్రస్థానానికి చేరుకుంది.
50 పాయింట్లతో సూపర్లీగ్ పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్నారు. 2023 వన్డే వరల్డ్కప్ కోసం సూపర్ లీగ్ను అర్హత టోర్నీగా ఐసీసీ నిర్వహిస్తోంది. దేశాల మధ్య ద్వైపాక్షిక వన్డే సిరీస్లతో ఇలాంటి ఫార్మాట్ను ఐసీసీ నిర్వహించడం ఇదే మొదటిసారి. టోర్నీలో మొత్తం 13 జట్లు పాల్గొంటాయి. అందులో 12 జట్లు ఐసీసీలో శాశ్వత సభ్య దేశాలు. టోర్నీలో పాల్గొంటున్న ప్రతీ జట్టు 12 జట్లలోని కనీసం 8 టీమ్లతో 8 సిరీస్ల్లో తలపడాల్సి ఉంది. అందులో 4 స్వదేశంలో మరో నాలుగు విదేశీ గడ్డపై ఆడాల్సి ఉంటుంది. పాయింట్ల పట్టికలో నిలిచిన మొదటి 8 జట్లు వన్డే ప్రపంచకప్నకు నేరుగా అర్హత సాధిస్తాయి. ఈ మెగా టోర్నీకి భారత్ ఆతిథ్యమిస్తున్నందున కోహ్లీసేన నేరుగా అర్హత సాధిస్తుంది.
లీగ్లో ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడిన బంగ్లా ఐదింటిలో గెలువగా, మూడింటిలో ఓటమిపాలైంది. 50 పాయింట్లతో టేబుల్ టాపర్గా ఉంది. ఇంగ్లాండ్ తొమ్మిది మ్యాచ్లు ఆడి 4 గెలువగా, ఐదు ఓడిపోయింది. 40 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. టీమ్ఇండియా ఆడిన ఆరు మ్యాచ్ల్లో మూడింటిలో విజయం సాధించగా అన్నే మ్యాచ్ల్లో పరాజయంపాలై 29 పాయింట్లతో
ఎనిమిదో స్థానంలో నిలిచింది.