క్యాండీ: బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక పట్టు బిగించింది. ప్రవీణ్ జయవిక్రమ ఆరు వికెట్లతో అల్లాడించడంతో బంగ్లా తొలి ఇన్నింగ్స్లో 251 పరుగులకు ఆలౌటైంది. తమీమ్ ఇక్బాల్ (92) టాప్ స్కోరర్. శనివారం మూడో రోజు రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన లంక ఆట ముగిసే సమయానికి 17/2తో నిలిచింది. చేతిలో 8 వికెట్లు ఉన్న లంక ప్రస్తుతం 259 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు 493/7 వద్ద లంక తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.