మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలుగా రూపొందిన చిత్రం అల వైకుంఠపురములో. గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ను షేక్ చేసిన ఈ చిత్రం మ్యూజికల్గాను పెద్ద హిట్ కొట్టింది. థమన్ స్వరపరచిన బాణీలు సంగీత ప్రియులని ఎంతగానో అలరించాయి. కేవలం మన దేశంలోనే కాదు విదేశాలలోను ఈ సినిమా సాంగ్స్కు అదిరిపోయే క్రేజ్ వచ్చింది.
తెలుగు సినిమాలో ఇప్పటి వరకు ఏ సినిమా ఆల్బమ్ కు రాని స్పందన అల వైకుంఠపురములో ఆల్బమ్ కు రాగా, ఈ ఆల్బమ్ ఇప్పుడు 2 బిలియన్ వ్యూస్ మార్క్ను క్రాస్ చేసి దక్షిణాది సినిమాలో ఫస్ట్ ఎవర్ రికార్డ్ సెట్ చేసినట్టు సమాచారం. ఇప్పటికే అనేక రికార్డులు సృష్టించిన అల వైకుంఠపురములో తాజాగా ఈ రికార్డ్ సాధించడం పట్ల ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.