అహ్మదాబాద్: పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 180 పరుగుల ఛేదనలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి వికెట్ కోల్పోయింది. సూపర్ ఫామ్లో ఉన్న దేవదత్ పడిక్కల్(7)..రిలే మెరిడిత్ వేసిన మూడో ఓవర్లో ఔటయ్యాడు. మరో ఎండ్లో విరాట్ కోహ్లీ నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నాడు.
పవర్ప్లే ఆఖరికి బెంగళూరు వికెట్ నష్టానికి 36 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో బెంగళూరు ధాటిగా ఆడాల్సి ఉండగా.. కోహ్లీ, పటిదార్ సింగిల్స్కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఇన్నింగ్స్ను చక్కదిద్దుతున్నారు. బెంగళూరు విజయానికి 72 బంతుల్లో 130 పరుగులు చేయాల్సి ఉంది. 8 ఓవర్లకు ఆర్సీబీ వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. కోహ్లీ(28), పటిదార్(13) క్రీజులో ఉన్నారు.