షార్జా: బంగ్లాదేశ్ ఆల్రౌండర్ షకీబల్ హసన్ రికార్డు సృష్టించాడు. టీ20 ప్రపంచకప్లో అత్యథిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. శ్రీలంక జరుగుతున్న మ్యాచ్లో తీసిన రెండు వికెట్లతో కలిపి ఇప్పటి వరకూ టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో షకీబల్ 41 వికెట్లు పడగొట్టాడు.
దీంతో టీ20 ప్రపంచకప్లో అత్యథిక వికెట్లు తీసిన బౌలర్గా పాకిస్థాన్ ఆల్రౌండర్షాహిద్ అఫ్రిదీ పేరిట ఉన్న రికార్డును షకీబల్ బద్దలు కొట్టాడు.
షార్జా: బంగ్లాదేశ్తో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ మ్యాచ్లో శ్రీలంక ఆటగాళ్లు తడబడుతున్నారు. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంకకు తొలి ఓవర్లోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ కుశాల్ పెరీరా (1)ను నాసుమ్ అహ్మద్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత కొంచెం నిలకడగా ఆడుతున్న పాథుమ్ నిశ్శంక (24)ను షకీబల్ అవుట్ చేశాడు.
ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన అవిష్క ఫెర్నాండో (0)ను కూడా షకీబల్ బోల్తా కొట్టించాడు. కాసేపటికే మహమ్మద్ సైఫుద్దీన్ బౌలింగ్లో వానిందు హసరంగ (6) కూడా పెవిలియన్ చేరాడు. చరిత్ ఆశలంక (26 బంతుల్లో 45) ఒక్కడే ఒంటరిపోరాటం చేస్తున్నాడు. మొత్తానికి పది ఓవర్లు ముగిసే నాటికి శ్రీలంక జట్టు 4 వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసింది.
టీ20 వరల్డ్ కప్ 2021లో భాగంగా షార్జాలోని స్టేడియంలో శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో శ్రీలంకకు తొలి ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. బంగ్లాదేశ్ 4 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసి శ్రీలంకకు 172 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. బ్యాటింగ్ బరిలోకి దిగిన శ్రీలంక.. 6 ఓవర్లలో ఒక వికెట్ను నష్టపోయి 54 పరుగులు చేసింది.
అయితే.. తొలి ఓవర్లోనే ఓపెనర్ కుశాల్ పెరీరా క్లీన్ బౌల్డయ్యాడు. మూడు బంతుల్లో ఒక పరుగు చేసి పెవిలియన్ బాట పట్టాడు. నసుమ్ వేసిన బంతికి ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో నిస్సాంక, చరిత్ అసలంకా ఉన్నారు. నిస్సాంక.. 15 బంతుల్లో 19 పరుగులు చేయగా.. చరిత్ 18 బంతుల్లో 32 పరుగులు చేశాడు.
షార్జా: బంగ్లాదేశ్ ఓపెనర్ మహమ్మద్ నయీమ్ (62) శుభారంభం అందించడంతో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో బంగ్లా జట్టు పటిష్ట స్కోరు చేసింది. నయీమ్ తర్వాత షకీబల్ హసన్ (10) వంటి స్టార్ ఆల్రౌండర్ విఫలమయ్యాడు. లిటాన్ దాస్ (16), ఆతిఫ్ హుస్సేన్ (7) కూడా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు.
అయితే వికెట్ కీపింగ్ బ్యాట్స్మెన్ ముష్ఫికర్ రహీం (57 నాటౌట్) రాణించాడు. ఈ ఇన్నింగ్సులో 4 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. దీంతో బంగ్లా జట్టు పటిష్ట స్కోరు దిశగా సాగింది. కానీ చివరి రెండు ఓవర్లలో అనుకున్నంత వేగంగా పరుగులు రాలేదు. చివరకు నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలకం బౌలింగ్ ఎంచుకుంది. లంక బౌలర్లలో చమిక కరుణరత్నె, బినుర ఫెర్నాండో, లాహిరు కుమార తలో వికెట్ తీసుకున్నారు.