షార్జా: బంగ్లాదేశ్తో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ మ్యాచ్లో శ్రీలంక ఆటగాళ్లు తడబడుతున్నారు. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంకకు తొలి ఓవర్లోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ కుశాల్ పెరీరా (1)ను నాసుమ్ అహ్మద్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత కొంచెం నిలకడగా ఆడుతున్న పాథుమ్ నిశ్శంక (24)ను షకీబల్ అవుట్ చేశాడు.
ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన అవిష్క ఫెర్నాండో (0)ను కూడా షకీబల్ బోల్తా కొట్టించాడు. కాసేపటికే మహమ్మద్ సైఫుద్దీన్ బౌలింగ్లో వానిందు హసరంగ (6) కూడా పెవిలియన్ చేరాడు. చరిత్ ఆశలంక (26 బంతుల్లో 45) ఒక్కడే ఒంటరిపోరాటం చేస్తున్నాడు. మొత్తానికి పది ఓవర్లు ముగిసే నాటికి శ్రీలంక జట్టు 4 వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసింది.