ముంబై: ఇండియన్ ప్రిమియర్ లీగ్ ( IPL ) 14వ సీజన్ కరోనా మహమ్మారి కారణంగా మధ్యలోనే వాయిదా పడింది. ఈ మిగిలిన టోర్నీని ఇండియా నుంచి యూఏఈకి తరలించింది బీసీసీఐ. అయితే అక్కడ కూడా టోర్నీకి మరోసారి ఎలాంటి అడ్డంకులు రాకుండా కఠినమైన కొవిడ్ ప్రొటోకాల్స్ను సిద్ధం చేసింది. సిక్స్ కొడితే బాల్ మార్చడం, ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ అవసరం లేకుండానే ప్లేయర్స్ను యూఏఈకి తరలించడం సహా మరెన్నో కొత్త కొవిడ్ నిబంధనలు వచ్చి చేరాయి. అవేంటో ఓసారి చూద్దాం.