సిర్గాపూర్, ఏప్రిల్ 2: మండల పరిధిలోని జెమ్లాతండా గ్రామ పంచాయతీ చిన్నదైనా అభివృద్ధి మాత్రం భేష్ అనిపించుకుంటున్నది. ప్రతి ఇంటా కొబ్బరి చెట్లు, ఇతర పండ్ల మొక్కల పెంపకంతో పచ్చదనం ఉట్టి పడుతున్నది. శాంతి భద్రతలకు విఘాతం కల్గకుండా తండాల్లో 10 కెమెరాలను ఏర్పాటు చేశారు. గిరిజనశాఖ ప్రత్యేక నిధులతో పంచాయతీ పరిధిలోని తండాలకు రూ1.61 కోట్లు మంజూరు కాగా, ఇటీవల రోడ్డు పనులను పూర్తి చేశారు. రోడ్డుకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ కింద రెండు కిలో మీటర్ల దూరం వరకు ఒకేరోజు 200 మందితో వేల సంఖ్యలో మొక్కలు నాటి ఔరా అనిపించి ఇతర తండాలకు ఆదర్శంగా నిలిచారు.
నాలుగు తండాలతో గ్రామ పంచాయతీ
గతంలో సిర్గాపూర్ గ్రామ పంచాయతీలో ఉన్న జెమ్లాతండా, నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటులో భాగంగా తోళ్యా తండా, జీవ్లాతండా-1, జీవ్లాతండా-2, కలిపి జెమ్లా తండా గ్రామ పంచాయతీగా ఏర్పడింది. తొలిసారి పంచాయతీ ఎన్నికల్లో ఎస్టీ మహిళకు స్థానం రిజర్వుకావడంతో జీవ్లాతండాకు చెందిన దివ్యభారతి తొలి సర్పంచ్గా ఎన్నికై టీఆర్ఎస్ సర్కార్ సహకారంతో రెండేండ్లలోనే గ్రామ పంచాయతీ రూపురేఖలు మార్చారు.
మొక్కల పెంపకం..
పంచాయతీ పరిధిలోని అన్ని తండాల్లో ప్రతి ఇంటా కొబ్బరి, ఇతర పండ్ల మొక్కలు పెంచుతున్నారు. మొక్కలు నాటించి వాటి సంరక్షణ చర్యలపై అవగాహన కల్పించి మొక్కల చుట్టూ కంచెను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం చెట్లు ఏపుగా పెరిగి ఆహ్లాద పరుస్తూ ఆకర్షణీయంగా మారాయి.
పల్లె ప్రగతిలో చేపట్టిన అభివృద్ధి
మొదటిసారి నిర్వహించిన పల్లె ప్రగతిలో రూ.1.37 లక్షలతో అభివృద్ధి పనులు చేశారు. అనంతరం గ్రామం లో మొరం వేసేందుకు రూ.2.79 లక్షలు, వీధి దీపాల ఏర్పాటుకు రూ.4 లక్షలు, నర్సరీకి రూ.30 వేలు, పల్లె ప్రకృతి వనం ఏర్పాటుకు రూ.3.50 లక్షలు, ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమానికి రూ.1.64 లక్షలు, శ్మశాన వాటికకు రూ.12 లక్షలు, డంపింగ్యార్డుకు రూ.2.50 లక్షలు, అవె న్యూ ప్లాంటేషన్కు రూ.32 వేలు ఖర్చుతో అభివృద్ధి పనులు చేశారు. ట్రాక్టర్ ఖరీదుకు నగదు రూ.3.50 లక్షలు, మిగతా బ్యాంకు రుణం తీసుకున్నారు.
పారిశుధ్యంపై దృష్టి
జెమ్లాతండా పరిధిలోని మూడు తండాల్లో పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వీధుల్లో చెత్త వేసేందుకు చెత్త కుండీలను ఏర్పాటు చేవారు. చెత్తనంతా పోగు చూసి పంచాయతీ ట్రాక్టర్ ద్వారా డంపింగ్ యార్డ్కు తరలిస్తున్నారు.
ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా…
ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో సమస్యలన్నీ తొలగిపోయాయి. ప్రజల సహకారంతో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తా. గ్రామ పంచాయతీలోని మూడు తండాల్లో 100 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలను త్వరలోనే చేపడతాం.
ఇవీ కూడా చదవండి
స్కౌట్స్, గైడ్స్ చీఫ్ కమిషనర్గా ఎమ్మెల్సీ కవిత
విద్యుత్ వాహనాలే ముద్దు.. 66% మంది మొగ్గు!
రుణ మారిటోరియంపై నేడు సుప్రీం రూలింగ్!
పక్కా! రిలయన్స్ ఏజీఎంలో 5జీ ఫోన్, జియోబుక్ లాంచ్?
‘మహమ్మారి వెంటాడినా ఏడాదిలో 1.38 లక్షల కొత్త కంపెనీల నమోదు’