టోక్యో: టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్లో బంగారు పతకం సాధించిన అవని లెఖారాకు ( Avani Lekhara ) తాజా ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా, వెయిట్లిఫ్టర్ మీరాబాయ్ ఛాను అభినందనలు తెలియజేశారు. ఇవాళ టోక్యోలో జరిగిన షూటింగ్ ఈవెంట్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అవని లెఖారా అద్భుత ప్రదర్శన కనబర్చి బంగారు పతకం సాధించింది. ఈ విజయంతో 19 ఏండ్ల అవని పారాలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి మహిళగా నిలిచింది.
కాగా, అవని లెఖారా నువ్వు పాల్గొన్న తొలి పారాలింపిక్స్లోనే అద్భుత ప్రదర్శన చేశావు. మా అందరికీ మరోసారి టోక్యోలో జాతీయ గేయం వినే అవకాశం కల్పించావు. నీకు నా అభినందనలు అని నీరజ్ చోప్రా ట్విట్టర్లో పేర్కొన్నారు. షూటింగ్లో గోల్డ్ మెడల్ సాధించినందుకు నీకు నా హృదయపూర్వక అభినందనలు అవని అని వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ ఛాను ట్వీట్ చేశారు.