రంగారెడ్డి: జిల్లాలోని చేవెళ్లలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని మీర్జాగూడ గేట్ వద్ద కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ప్రమాదంలో మరణించినవారిని ఆలూరుకు చెందిన శ్రవణ్, కొండాపూర్కు చెందిన నవీన్గా, గాయపడినవారిని కౌకుంట్లకు చెందిన మహేందర్రెడ్డి, ఉదయ్ కిరణ్ అని గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.