యాదాద్రి, ఏప్రిల్3: తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జయంతిని జరుపుకొన్నారు. శనివారం యాదగిరిగుట్ట పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద ఆయన చిత్రపటానికి కురుమ సంఘం నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. కురుమ సంఘం మండల అధ్యక్షుడు కవిడే మహేందర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించగా చొల్లేరు సర్పంచ్ తొటకూరి బీరయ్య, కురుమ సంఘం జిల్లా కార్యదర్శి కాదూరి అచ్చయ్య, కురుమ సంఘం నాయకులు కాదూరి శ్రీశైలం, గౌడ రాజు, ఎడపల్లి పర్వతాలు, సుక్కల సంజీవ, కర్రె లక్ష్మయ్య పాల్గొన్నారు.
ఆలేరులో…
ఆలేరు టౌన్, ఏప్రిల్ 3 : ఆలేరు మండల కేంద్రంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధపోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గవ్వల నర్సింహులు, పేరపు రాములు, జూకంటి ఉప్పలయ్య, కూళ్ల సత్తయ్య, కూళ్ల సిద్ధులు, శంకర్, కుండె సంపత్, రాయపురం నర్సింహులు, కూళ్ల వెంకటేశ్, బాలయ్య, వెంకటేశ్, జెట్ట బాలనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
రాజాపేటలో..
రాజాపేట, ఏప్రిల్ 3: మండల కేంద్రంలో శనివారం తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జయంతిని జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రేగు సిద్ధులు, నాయకులు నెమిల మహేందర్గౌడ్, వస్పరి విష్ణు, నక్కిర్త కనకరాజు, కర్రె సిద్ధులు, జెన్నె సిద్ధులు, శ్రీశైలం, ఉపేందర్, భరత్, భాస్కర్, కరుణాకర్, శ్రీను, వెంకటయ్య, మధు, సిద్ధిరాజు, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.
దొడ్డి కొమురయ్య త్యాగం మరువలేనిది
ఆత్మకూరు(ఎం), ఏప్రిల్ 3: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరుడైన దొడ్డి కొమురయ్య ప్రాణ త్యాగం మరువలేనిదని గొర్ల కాపరుల సంఘం జిల్లా నాయకుడు కోరె భిక్షపతి అన్నారు. దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా మండల కేంద్రంలోని కురుమ సంఘం కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం గ్రామ అధ్యక్షుడు బీరయ్యతో పాటు మల్లేశం, నర్సయ్య, శ్రీశైలంమల్లన్న, చంద్రయ్య, అయ్యాలం పాల్గొన్నారు.