మేల్ (మాల్దీవులు): ఐపీఎల్ 14వ సీజన్ నిరవధికంగా వాయిదా పడ్డాక మాల్దీవులకు వెళ్లిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు, కోచ్లు, కామెంటేటర్లు త్వరలోనే స్వదేశానికి పయనం కానున్నారని సమాచారం. 14 మంది ప్లేయర్లు సహా మొత్తం 38 మందితో కూడిన ఆసీస్ బృందం ఆదివారం ప్రత్యేక విమానంలో బయలుదేరనుందని క్రిక్ ఇన్ఫో వెల్లడించింది. అయితే ఈ విషయంపై ఆస్ట్రేలియా ప్రభుత్వ అనుమతి కోసం బీసీసీఐ, సీఏ వేచి చూస్తున్నాయని తెలిపింది.