ములుగురూరల్/ వెంకటాపూర్/ మంగపేట/ మల్హర్/ భూపాలపల్లి రూరల్/ ములుగు టౌన్, మే 25: కరోనా నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న బాధితులకు పలువురు ఆర్థికసాయం అందజేస్తున్నారు. ములుగులో ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ టీచర్లకు ఏఎస్పీ పోతరాజు సాయిచైతన్య మంగళవారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. సరుకులను సమకూర్చిన ఇన్నెల కీర్తి, వెంకటేశ్, శారద, నాగభూషణ్ను అభినందించారు. అలాగే, ప్రభుత్వ దవాఖాన ఆవరణలో గొల్లపల్లి రాజేందర్గౌడ్, బాణాల సుధాకర్ ఆధ్వర్యంలో సీఐ గుంటి శ్రీధర్ అన్నం ప్యాకెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో చాంద్పాష, నూనేటి శ్యామ్, ఎండీ అజ్జు పాల్గొన్నారు. వెంకటాపూర్ మండలంలోని కేశవపూర్లో ఇల్లు కాలిపోయిన బాధితులకు ఏఎస్పీ సాయి చైతన్య 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు, రూ.వెయ్యి నగదు అందించారు. వెంకటాపూర్ ఎస్సై డీ రమేశ్, సర్పంచ్ కొయ్యల జయలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి అనిల్ పాల్గొన్నారు. మంగపేట మండలంలోని బోరునర్సాపురం, వాడగూడెం, తిమ్మంపేటలో కరోనా బాధితులకు జ్వాలా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేశ్, డైరెక్టర్ పుల్లంశెట్టి అజయ్ పాల్గొన్నారు. మల్హర్ మండలంలోని ఎడ్లపల్లిలో కొవిడ్తో బాధపడుతున్న చిన్నారులు, వారి తల్లిదండ్రులకు జిల్లా బాలల సంరక్షణ అధికారి హరికృష్ణ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ 040-23733665కు వచ్చిన సమాచారం ఆధారంగా పిల్లల కుటుంబానికి నిత్యావసర సరుకులు అందజేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో అధికారులు రాజ కొంరయ్య, వెంకటస్వామి, సోషల్ కుమార్, అంగన్వాడీ టీచర్ అరుణ పాల్గొన్నారు. భూపాలపల్లి పరిధిలోని పుల్లూరు రామయ్యపల్లెకు చెందిన సంపత్ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా బాధిత కుటుంబానికి నేతకాని సంఘం యూత్ జిల్లా అధ్యక్షుడు గజ్జె రాజ్కుమార్ ఆధ్వర్యంలో 25 కేజీల బియ్యం, నిత్యావసర వస్తువులు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు ఆకుదారి మధు, స్వామి, దుర్గం అనిల్ పాల్గొన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని పారిశుధ్య కార్మికులకు టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మెరుగు సంతోష్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. సీనియర్ నాయకుడు గండ్రకోట సుధీర్ యాదవ్, ఎంపీటీసీ గొర్రె సమ్మయ్య, రాధ కుమార్, యశ్వంత్ పాల్గొన్నారు.