Sports
- Jan 12, 2021 , 21:29:48
విల్ పుకోస్కీ ఔట్?

బ్రిస్బేన్: భారత్తో మూడో టెస్టులో అరంగేట్రం చేసిన యువ ఓపెనర్ విల్ పుకోస్కీ నిర్ణయాత్మక ఆఖరి టెస్టుకు దూరమయ్యే అవకాశం ఉంది. సిడ్నీ టెస్టు ఐదో రోజు ఆటలో ఫీల్డింగ్ సమయంలో పుకోస్కీ డైవ్ చేయగా అతని భుజానికి బలమైన గాయమైంది. నాలుగో టెస్టు ప్రారంభానికి ముందు అతని ఫిట్నెస్ను పరీక్షించి నాలుగో టెస్టుకు ఎంపిక చేసే విషయంపై నిర్ణయం తీసుకుంటామని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది.
ప్రస్తుతం విల్ విశ్రాంతి తీసుకుంటున్నాడని వెల్లడించింది. పుకోస్కీ భుజం ఎముక పాక్షికంగా పక్కకు జరిగడంతో నొప్పితో బాధపడుతున్నాడు. అరంగేట్ర మ్యాచ్లో విల్ 64, 8 స్కోర్లు చేశాడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య కీలకమైన నాలుగో టెస్టు బ్రిస్బేన్ వేదికగా జనవరి 15-19 మధ్య జరగనుంది.
తాజావార్తలు
- భార్యను చంపిన కేసులో ఏడేండ్ల జైలు
- బైకులు ఢీకొని ఒగ్గు కళాకారులు దుర్మరణం
- రాష్ట్రంలో పెరుగుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు
- చదువుకోక టీవీ చూస్తున్నాడని నిప్పంటించాడు
- కూలీలపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. 13 మంది మృతి
- రద్దు చేసిన రైళ్ల పునరుద్ధరణ
- మేడారం మినీ జాతరకు ప్రత్యేక బస్సులు
- అంగన్వాడీల సేవలు మరింత విస్తరణ
- దేశంలోనే తెలంగాణ పోలీస్ అగ్రగామి
- శుభ్మన్ గిల్ అర్ధ సెంచరీ.. భారత్ 70/1
MOST READ
TRENDING