కరోనా కారణంగా అర్ధాంతరంగా ఆగిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్లో మిగిలిన మ్యాచ్లను నిర్వహించేందుకు బీసీసీఐ సన్నద్ధమవుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 18 లేదా 19న యూఏఈ వేదికగా సీజన్ రెండో దశను ప్రారంభించాలని భావిస్తోంది. ఇదే సమయంలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్ కోసం వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది.
బయో బబుల్ భయంతో పలువురు ఆటగాళ్లు ఈ టూర్ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత బంగ్లాదేశ్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ కూడా ఖరారైంది. ఆగస్టులో ఇరుజట్లు ఐదు టీ20ల్లో తలపడనున్నాయి. టీ20 వరల్డ్కప్నకు ముందు ఈ టీ20 సిరీస్ను ఆసీస్ సన్నాహకంగా భావిస్తోంది. బిజీ షెడ్యూల్ కారణంగా లీగ్లోని మిగతా మ్యాచ్లకు ఆస్ట్రేలియా ఆటగాళ్లు దూరంకానున్నట్లు తెలుస్తోంది.