వరంగల్: ఎన్నికల విధులకు హాజరైన ఓ ఉపాధ్యాయుడు గుండెపోటుతో మరణించారు. మెతుకు రమేష్ బాబు అనే ఉపాధ్యాయుడు జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని కొండాపూర్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నారు. అయితే ఎన్నికల విధుల్లో భాగంగా గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ 57వ డివిజన్లోని సమ్మయ్య నగర్లో పోలింగ్ బూత్ కేటాయించారు. శుక్రవారం ఉదయం పోలింగ్ విధులు నిర్వహిస్తుండగా గుండెపోటు రావడంతో రమేష్ బాబు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దవాఖానకు తరలించేలోపే ఆయన మృతిచెందారు.
కాగా, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లో 66 డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 500 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. ఇక్కడ 6,53,240 మంది ఓటర్లు ఉన్నారు. వీరికోసం 878 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల వరకు వరంగల్లో 11.2 శాతం పోలింగ్ నమోదయింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..