న్యూఢిల్లీ : జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్), గ్రాట్యుటీ ఫండ్లపై 7.1 శాతంగా ఉన్న వడ్డీ రేటును యథాతథంగా కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ క్వార్టర్ లో జీపీఎఫ్ ఇతర ప్రత్యేక డిపాజిట్ పథకాలపై వడ్డీరేటు 7.1 శాతం ఉంటుందని ఆర్ధిక మంత్రిత్వ శాఖ అధీనంలోని ఆర్థిక వ్యవహారాల విభాగం ఓ ప్రకటనలో పేర్కొంది.
ప్రభుత్వేతర భవిష్య నిధి, ఇతర గ్రాట్యుటీ ఫండ్ లపైనా 7.1 శాతం వడ్డీ ఉంటుందని తెలిపింది. పీపీఎఫ్, ఎన్ఎస్సీ వంటి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేటును యథాతథంగా ఉంచిన క్రమంలో దానికి అనుగుణంగా జీపీఎఫ్, గ్రాట్యుటీ ఫండ్ల వడ్డీరేటుపై తాజా నిర్ణయం తీసుకున్నారు.