ఓస్లో : పురుషుల ట్రాక్ ఈవెంట్లో.. నార్వే అథ్లెట్ కార్స్టెన్ వార్హోమ్ చరిత్ర సృష్టించాడు. 400 మీటర్స్ హర్డిల్స్ ఈవెంట్లో కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. రేసును కేవలం 46.70 సెకన్లలో పూర్తి చేసి సరికొత్త చరిత్రను లిఖించాడతను. ఓస్లోలో జరిగిన డైమండ్ లీగ్ పోటీల్లో ఆ ఘనతను సాధించాడు. 1992లో ఒలింపిక్ చాంపియన్ కెవిన్ యంగ్ పేరిట ఉన్న 46.78 సెకన్ల రికార్డును వార్హోమ్ బద్దలు కొట్టాడు. మూడుసార్లు వరల్డ్ చాంపియన్గా నిలిచిన వార్హోమ్.. డైమండ్ లీగ్లో ఆరంభం నుంచి ముందంజలో ఉన్నాడు. ఫినిషింగ్ లైన్ను అదే వేగంతో పూర్తి చేశాడు. 2019లో జరిగిన పాన్ అమెరికా క్రీడల్లోనూ వార్హోమ్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు.