పటియాల: భారత అథ్లెటిక్స్ కోచ్ నికోలయ్ స్నెసరేవ్ శుక్రవారం ఆకస్మికంగా మరణించాడు. తన గదిలో అపస్మారక స్థితిలో నికోలయ్ ఉన్నట్లు భారత అథ్లెటిక్స్ సమాఖ్య(ఏఎఫ్ఐ) ఒక ప్రకటనలో పేర్కొంది. దాదాపు రెండేండ్ల తర్వాత ఇటీవలే జాతీయ అథ్లెటిక్స్ కోచ్గా తిరిగి బాధ్యతలు స్వీకరించిన 72 ఏండ్ల నికోలయ్ ఇలా మరణించడం అథ్లెటిక్స్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. అవినాశ్ సాబ్లె, ప్రీజా శ్రీధరన్, కవితా రౌత్, లలితా బాబర్ లాంటి అథ్లెట్లను తీర్చిదిద్దడంలో నికోలయ్ కీలక పాత్ర పోషించాడు.