హైదరాబాద్: కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో పతకాలే లక్ష్యంగా తెలుగు యువ అథ్లెట్లు గందె నిత్య, జ్యోతిక శ్రీ జాతీయ శిక్షణా శిబిరానికి ఎంపికయ్యారు. పాటియాలలో జరుగనున్న కేంద్రంలో వీరు నిపుణులైన కోచ్ల సమక్షంలో అత్యుత్తమ శిక్షణ పొందనున్నారు. సాయ్ గోపీచంద్ మైత్రా అకాడమీకి చెందిన వీరిద్దరు అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారని జాతీయ అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ పేర్కొన్నాడు.