టోక్యో: ఈసారి ఒలింపిక్స్లో మెడల్ ఖాయమనుకున్న గేమ్స్లో ఆర్చరీ ఒకటి. కానీ తొలి రోజే అర్హత రౌండ్లలో మన ఆర్చర్లు నిరాశపరిచారు. మహిళల సింగిల్స్లో దీపికా కుమారి 9వ ర్యాంక్తో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. పురుషుల సింగిల్స్లో అయితే మన వాళ్ల ప్రదర్శన మరింత దారుణంగా ఉంది. ర్యాంకింగ్ రౌండ్లో ప్రవీణ్ జాదవ్ 656 పాయింట్లతో 31వ స్థానంలో నిలిచాడు. ఇండియా తరఫున అతడిదే బెస్ట్ ర్యాంక్. ఇక అతాను దాస్ అయితే 653 పాయింట్లతో 35వ స్థానానికి పరిమితమయ్యాడు. అయితే ప్రవీణ్ కంటే రెండు 10లు ఎక్కువ కొట్టాడు. అతాను మొత్తం 24 10లు సాధించాడు. మరో ఆర్చర్ తరుణ్దీప్ రాయ్ 37వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.