హైదరాబాద్, ఆట ప్రతినిధి: గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఫుట్బాల్ అకాడమీ ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. గజ్వేల్లో సమగ్ర క్రీడాభివృద్ధిపై సోమవారం తన కార్యాలయంలో ఆయన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్కు దగ్గరగా ఉన్న గజ్వేల్లో క్రికెట్ స్టేడియం నిర్మాణం, గేమ్స్ విలేజ్కు 50 ఎకరాల భూమిని కేటాయించాలని సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి మంత్రి లేఖ రాశారు. ఫుట్బాల్ అకాడమీ ఏర్పాటుకు తక్షణం రూ.2 కోట్లు విడుదల చేస్తూ నిధుల మంజూరు జీవో కాపీని టీఎస్ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్రెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, క్రీడా, పర్యాటక శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు తదితరులు పాల్గొన్నారు.