గౌహతి: ఒలింపిక్స్లో తమ రాష్ట్రం అమ్మాయి చరిత్ర సృష్టించడాన్ని ప్రత్యక్షంగా చూడాలనుకున్నారు అస్సాం ఎమ్మెల్యేలు. దీనికోసం అసెంబ్లీ సమావేశాలను 30 నిమిషాల పాటు వాయిదా వేశారు. టోక్యో ఒలింపిక్స్లో భాగంగా 64-69 కేజీల బాక్సింగ్ విభాగంలో అస్సాం అమ్మాయి లవ్లీనా బోర్గోహైన్ ( Lovlina Borgohain ) బుధవారం సెమీఫైనల్లో తలపడిన విషయం తెలిసిందే. ఈ బౌట్ ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. దీంతో అంతకుముందే అసెంబ్లీని వాయిదా వేశారు. ఈ బౌట్ చూడటానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన పెద్ద స్క్రీన్పై ఈ బౌట్ చూశారు. ఈ బౌట్లో ఓడిపోయిన లవ్లీనా ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్తో సరిపెట్టుకుంది.