బీజింగ్: చైనా వేదికగా నవంబర్లో జరుగాల్సి ఉన్న ఆసియా యూత్ గేమ్స్ వాయిదాపడ్డాయి. ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (ఒసీఏ) బుధవారం ఈ విషయాన్ని వెల్లడించింది. కొవిడ్-19 నేపథ్యంలో ఈ క్రీడలను 2022 డిసెంబర్కు వాయిదా వేస్తున్నట్టు ఒసీఏ ప్రకటించింది. చైనాలోని గువాంగ్డంగ్ ఫ్రావిన్స్లోని షాంటో నగరంలో నవంబర్ నుంచి యూత్ గేమ్స్ నిర్వహించాల్సి ఉంది. కానీ అథ్లెట్ల భద్రత, వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ క్రీడలను వాయిదా వేస్తున్నట్టు ఒసీఏ తెలిపింది. కరోనా కారణంగా ఈ ఏడాది నవంబర్లో చైనాలోని చోంగ్కింగ్లో నిర్వహించాల్సిన స్కేటింగ్ గ్రాండ్ప్రి కూడా రైద్దెన విషయం తెలిసిందే.