హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఆసియన్ స్కూల్స్ అండర్-7 ఆన్లైన్ చెస్ చాంపియన్షిప్లో రాష్ర్టానికి చెందిన మాస్టర్ బాతుల ఆరుశ్ రజత పతకంతో మెరిశాడు. మొత్తం 25 ఆసియా దేశాలకు చెందిన ప్లేయర్ల మధ్య జరిగిన ఆన్లైన్ టోర్నీలో ఆరుశ్ 9 పాయింట్లకు గాను 7.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. భారత్కే చెందిన చౌహాన్ విజేతగా నిలిచాడు. ఆరుశ్ను రాష్ట్ర చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రసాద్ అభినందించారు.