న్యూఢిల్లీ: బాక్సర్ నాంగోమ్ డింకో సింగ్ గురువారం మృతి చెందాడు. 1998 ఏషియన్ గేమ్స్లో బాంటమ్వెయిట్ కేటగిరీలో గోల్డ్ మెడల్ గెలిచిన డింకో.. కొన్నేళ్లుగా వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. 2017లో లివర్ క్యాన్సర్ బారిన పడి చికిత్స కూడా తీసుకున్నాడు. గతేడాది కరోనా బారిన కూడా పడినా.. కోలుకున్నాడు. ఇంఫాల్లో ఉండే డింకో.. 2020లో ఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బైలరీ సైన్సెస్లో రేడియేషన్ థెరపీ తీసుకున్నాడు. గత ఏప్రిల్లో మరోసారి ఆరోగ్యం విషమించడంతో మరోసారి అతన్ని అదే హాస్పిటల్కు తీసుకెళ్లారు. అతనికి జాండిస్ కూడా ఉన్నట్లు తేలింది.
1998లో అర్జున, 2013లో పద్మశ్రీ అవార్డులను డింకో సింగ్కు భారత ప్రభుత్వం ప్రదానం చేసింది. డింకో మరణంపై బాక్సర్ విజేందర్ సింగ్ స్పందించాడు. ట్విటర్లో అతనికి నివాళులర్పించాడు. అతని జీవితం, పోరాటం రాబోయే ఎన్నో తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని విజేందర్ అన్నాడు. ఇండియన్ నేవీకి కూడా డింకో సేవలందించాడు. అనారోగ్యం బారిన పడక ముందు కోచ్గా కూడా చేశాడు.