న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్కు సన్నాహంగా భావిస్తున్న ఆసియా బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్ల జోరు కొనసాగుతున్నది. ఇప్పటి వరకు టోర్నీలో భారత్కు 15 పతకాలు ఖాయమయ్యాయి. బుధవారం జరిగిన పురుషుల 52కిలోల క్వార్టర్స్ బౌట్లో ప్రపంచ చాంపియన్ అమిత్ పంగల్ 3-2తో ఖరాకు ఎక్మమందక్(మంగోలియా)పై అద్భుత విజయం సాధించాడు. చాడు. మిగతా క్వార్టర్స్ బౌట్లలో వికాస్ క్రిషన్(69కి) 4-1తో మోస్లెమ్ మాగ్సౌదీపై గెలువగా, వరిందర్(69కి) 5-0తో సామ్యూల్ డెలాక్రజ్(ఫిలిప్పిన్స్)ను చిత్తుగా ఓడించాడు.