దుబాయ్: కరోనా వైరస్ విజృంభణ
కారణంగా వాయిదాపడ్డ ఈ ఏడాది ఆసియాకప్ను 2023లో నిర్వహించాలని ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ) నిర్ణయించింది. షెడ్యూల్ ప్రకారం గతేడాది పాకిస్థాన్ వేదికగా ఆసియాకప్ జరుగాల్సి ఉన్నా.. అక్కడ ఆడేందుకు టీమ్ఇండియా నిరాకరించడంతో టోర్నీని శ్రీలంకకు తరలించారు. అయితే తాజాగా మహమ్మారి ప్రభావం ఎక్కువ కావడంతో ఆసియాకప్ను వాయిదా వేశారు. కాగా వచ్చే ఏడాది కూడా ఆసియాకప్ నిర్వహించాల్సి ఉండటంతో పాటు అన్నీ జట్ల షెడ్యూల్ బిజీగా ఉండటంతో ఈ టోర్నీని 2023లో జరుపాలని ఏసీసీ నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది.