న్యూఢిల్లీ: భారత మహిళల బ్యాడ్మింటన్ జోడీ సిక్కిరెడ్డి-అశ్విని పొన్నప్ప డెన్మార్క్ మాస్టార్స్ ఇంటర్నేషనల్ చాలెంజ్లో రన్నరప్గా నిలిచింది. రెండో సీడ్గా బరిలోకి దిగిన భారత ద్వయం ఫైనల్లో 21-15, 19-21, 14-21తో టాప్ సీడ్ అమేలీ మాగెలాండ్-ఫ్రెజా రాన్ (డెన్మార్క్) చేతిలో ఓటమి పాలైంది. తొలి గేమ్లో విజయం సాధించిన సిక్కి జోడీ.. రెండో గేమ్లోనూ ఆధిక్యంలో ఉన్న తర్వాత మ్యాచ్ను చేజార్చుకుంది.