ముషీరాబాద్, జూలై 1 : ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షణ చర్యలు చేపట్టాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పిలుపునిచ్చారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా గురువారం అడిక్మెట్ డివిజన్ విద్యానగర్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దూరదృష్టితో హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు వెళ్తున్న సీఎం కేసీఆర్కు అండగా నిలువడానికి ప్రతి పౌరుడు బాధ్యతగా మొక్కలు నాటి హరితహారంలో భాగస్వాములు కావాలని కోరారు. టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సురేందర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బి.హేమలతారెడ్డి టీఆర్ఎస్ నాయకులు ముఠా జయసింహ, శ్యామ్సుందర్, సురేందర్, మాధవ్, బి.శ్రీనివాస్రెడ్డి, శ్రీనివాస్, సయ్యద్ అస్లాం, ప్రేమలతారెడ్డి, అనురాధ, ప్రసన్న, ప్రేమ్కుమార్, రఘు, శ్రీకాంత్, హరీశ్ పాల్గొన్నారు.
ప్రతిఒక్కరూ మొక్కలు నాటి హైదరాబాద్ను ఆకుపచ్చ నగరంగా తీర్చిదిద్దేందుకు కృషిచేయాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఏడో విడుత హరితహారంలో భాగంగా గురువారం భోలక్పూర్ డివిజన్లోని దేవునితోటలోని శ్రీ భవానీశంకర్ ఆలయ ప్రాంగణంలో ఆలయ చైర్మన్ ఆర్.శ్రీనివాస్, కార్యనిర్వహణాధికారి బి.జ్యోతి, ముషీరాబాద్ సర్కిల్-15 డీఎంసీ హరికృష్ణ, జీహెచ్ఎంసీ ఏఎంఓహెచ్ డాక్టర్ హేమలత, హార్టికల్చర్ అధికారి సత్యతో కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొక్కలు నాటడానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో 5లక్షల మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టామన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నగర యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, టీఆర్ఎస్ భోలక్పూర్ డివిజన్ సీనియర్ నాయకుడు నవీన్కుమార్, అధ్యక్షుడు మహ్మద్ అలీ, ప్రధానకార్యదర్శి శ్రీనివాస్ రావు, శంకర్ గౌడ్, లక్ష్మీగణపతి ఆలయ చైర్మన్ ప్రభాకర్, గోవింద్రావు, కిరణ్, హాజీపాషా, శ్రీకాంత్, రాకేశ్కుమార్, శ్రీధర్రెడ్డి, సాయి చాణక్యరెడ్డి, సుధాకర్, దేవాలయ సిబ్బంది సుకేశ్కుమార్, శోభ తదితరులు పాల్గొన్నారు.
పరిశుభత్ర, పచ్చదనం లక్ష్యంగా పట్టణ ప్రగతి కార్యక్రమం ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. గాంధీనగర్ డివిజన్ వార్డు కార్యాలయం ప్రాంగణంలో గురువారం ఆయన పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించి మొక్కలు నాటారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ పావని, మాజీ కార్పొరేటర్ పద్మ, పార్టీ సీనియర్ నాయకుడు నరేశ్, యువ నాయుడు జైసింహ, పార్టీ డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్గుప్తా, శ్రీకాంత్, ప్రభాకర్, రాకేశ్, జగదీశ్ బాబు, శ్రీనివాస్, పరశురాం, నర్సింగ్ రావు, రామ్రాజ్, వెంకటేశ్, రశి శంకర్గుప్తా, భాస్కర్ పాల్గొన్నారు.