రానున్న రోజులలో డిజిటల్ మీడియాదే హవా ఎక్కువగా ఉంటుందని పరిస్థితులు చూస్తుంటే అర్ధమవుతుంది. అందుకే స్టార్ హీరోలు, హీరోయిన్స్ డిజిటల్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. సమంత .. ది ఫ్యామిలీ మెన్ 2 అనే వెబ్ సిరీస్ చేయగా, కాజల్ అగర్వాల్ లైవ్ టెలికాస్ట్లో నటించింది. రీసెంట్గా తమన్నా 11 అవర్ అనే వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ .. ”రుద్ర” అనే సిరీస్ తో డిజిటల్ డెబ్యూ ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ‘ది ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్’ అనేది దీనికి ఉపశీర్షిక. BBC స్టూడియోస్ ఇండియా సహకారంతో అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సిరీస్ ను నిర్మిస్తున్నారు.
‘రుద్ర – ది ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్’ క్రైమ్ డ్రామా సిరీస్ 2021లోనే డిస్నీ+హాట్ స్టార్ విఐపిలో విడుదల చేయబోతున్నారు. ఇందులో ఐకానిక్ కాప్గా కనిపించి అలరించనున్నారు. ‘లూథర్’ అనే బ్రిటీష్ డ్రామా సిరీస్ ఆధారంగా రూపొందుతోంది. ముంబైలోని ఐకానిక్ ప్రదేశాలలో ఈ వెబ్ సిరీస్ను చిత్రీకరించారు. రుద్ర సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని అజయ్ దేవగణ్ అన్నారు. కాగా, అజయ్ దేవగన్ ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన ఫస్ట్ లుక్ విడుదల కాగా, ఇది అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంది.