మస్కట్: టీమ్ఇండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ మేనల్లుడు అర్మాన్ జాఫర్ (114 బంతుల్లో 122; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో చెలరేగడంతో ఒమన్తో జరిగిన రెండో వన్డేలో ముంబై జట్టు 231 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. అర్మాన్తో పాటు సుజిత్ నాయక్ (73) రాణించాడు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన ఒమన్ 22.5 ఓవర్లలో 69 పరుగులకే ఆలౌటైంది. ముంబై బౌలర్లలో మోహిత్ (4/31), ధుర్మిల్ (3/21), దీపక్ (2/9) విజృంభించారు.