నారాయణపేట టౌన్, జూన్ 15 : హరితహారం కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసి విజయవంతం చేయాలని కలెక్టర్ హరిచందన ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలోని ఎంపీడీవోలు, ఎంపీవోలతో సమీక్షా సమావేశం నిర్వహించి మా ట్లాడారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలలోని ప్రతి ఇం టి ఆవరణలో 6 మొక్కలు నాటేలా చర్యలు చేపట్టాలన్నా రు. రహదారుల వెంట రెండు వరుసల్లో మొక్కలు నా టాలన్నారు. గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని, గ్రామాలు, పట్టణాలు అపరిశుభ్రంగా ఉంటే వానకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉం టుందన్నారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత నిర్మించుకోవాలని, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. గ్రామాల్లో ఇంటింటి చెత్త సేకరణ చేపట్టి, తడి పొడి చెత్తను వేరుచేసి కంపోస్టు తయారు చేయాలన్నారు. గ్రామా లు అపరిశుభ్రంగా కనిపిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. నర్సరీల్లో బోర్డులను ఏర్పాటు చేసి మొక్కలకు సంబంధించిన వివరాలు నమోదు చేయాలని సూచించారు. గ్రామ పంచాయతీల్లోని విద్యాసంస్థలు, అంగన్వాడీ కేంద్రాల్లో మునగ, నిమ్మ, కరివేపాకు, జామ మొ క్కలు నాటాలన్నారు. డంపింగ్ యా ర్డులు, శ్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాల్లో మొక్కలు నాటాలని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, డీఎంహెచ్వో శైలజ, డీపీవో మురళి, జెడ్పీ సీఈవో సిద్దిరామప్పతోపాటు ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు పాల్గొన్నారు.
ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందజేత
పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో పునర్జన్మ ఫౌండేషన్ నిర్వాహకులు 2 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను కలెక్టర్ హరిచందన సమక్షంలో జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శైలజకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ కొవిడ్తో బాధపడుతున్న రోగులకు వీటితో ఆక్సిజన్ అందించడం ద్వారా, వారికి మరో జీవితాన్ని అందించిన వారమవుతామని చెప్పారు. కాన్సన్ట్రేటర్లు అందజేసిన ఫౌండేషన్ నిర్వాహకులకు డీఎంహెచ్వో శైలజ కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రఘురాజగోపాల్ పాల్గొన్నారు.