సిటీబ్యూరో, జూన్ 15(నమస్తే తెలంగాణ): ఉద్యోగం చేసే గర్భిణులు, చంటి పిల్లల తల్లులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సూచించారు. మంగళవారం కార్(సిటీ ఆర్ముడ్ రిజర్వు) హెడ్ క్వార్టర్స్లో ఉద్యోగులైన 98 మంది గర్భిణులు, చంటిపిల్లల తల్లులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. నగర పోలీస్ కమిషనరేట్లో చంటి పిల్లల తల్లులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి.. వారికి అనుకూలమైన సమయాల్లోనే పనులు చేసుకునే విధంగా వీలు కల్పించామన్నారు. గర్భిణులైన ఉద్యోగులు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ.. విధుల్లో పాల్గొనాలని, ఆందోళనకు గురికాకుండా ప్రశాంతంగా విధులు నిర్వహించుకోవాలన్నారు. నగర అదనపు సీపీలు శిఖాగోయెల్, అనిల్కుమార్ మాట్లాడుతూ.. సరైన ఆహారం, విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు డీసీపీ రాంచంద్రరావు, శ్రీనివాసరావు, శ్యాంబాబు, మహ్మద్ భూరాన్ అలీ తదితర అధికారులు పాల్గొన్నారు.