సెయింట్ జార్జ్స్ (గ్రెనడా): ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ కైవసం చేసుకుంది. వెస్టిండీస్తో శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఆఖరి మ్యాచ్లో దక్షిణాఫ్రికా 25 పరుగుల తేడాతో నెగ్గి ఐదు మ్యాచ్ల సిరీస్ను 3-2తో చేజిక్కించుకుంది. చివరి మ్యాచ్లో మార్క్మ్ (70), డికాక్ (60) అర్ధశతకాలతో రాణించడంతో సఫారీ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లకు 168 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో ఎవిన్ లూయిస్ (52) మినహా తక్కినవాళ్లంతా విఫలమవడంతో విండీస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 143 పరుగులకు పరిమితమైంది. సఫారీ బౌలర్లలో ఎంగ్డీ 3, రబడ, మల్డర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.