నిజామాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇవాళ నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ సీనియర్ నాయకులు అలీం కుటుంబ సభ్యులను, నిజామాబాద్ జిల్లా టీఎన్జీవో అధ్యక్షులు కిషన్ను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. అలీం, కిషన్ తండ్రి ఇటీవలే మరణించారు. వీరిద్దరి ఫోటోలకు కవిత పుష్పాంజలి ఘటించారు.
అంతకుముందు డిచ్పల్లి మండలం మెట్రాజ్పల్లిలో 21 వ ప్యాకేజి పనులను పరిశీలించిన ఎమ్మెల్సీ కవిత పరిశీలించారు. కాల్వాల ద్వారా పంటపొలాలు నీరు అందే తీరును కవితకు ప్రాజెక్టు అధికారులు వివరించారు.