రియో డి జనెరో: స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ డబుల్ గోల్స్(33సె, 42సె)తో మెరువడంతో కోపా అమెరికా టోర్నీలో అర్జెంటీనా అలవోకగా క్వార్టర్స్లో అడుగుపెట్టింది. మంగళవారం తన చివరి గ్రూప్ మ్యాచ్లో అర్జెంటీనా 4-1 తేడాతో బొలివియాను చిత్తుచేసింది. క్వార్టర్స్లో ఈక్వెడార్పై మెస్సీసేన గెలిస్తే.. సెమీస్లో ఉరుగ్వే ఎదురయ్యే అవకాశముంది. మరోవైపు బార్సిలోనాతో మెస్సీ కాంట్రాక్టు బుధవారంతో ముగియనుండడంతో ఉత్కంఠ నెలకొంది.