టోక్యో పారాలింపిక్స్లో ఆర్చర్ రాకేశ్ కుమార్ మెరుగైన ప్రదర్శన కొనసాగుతున్నది. శనివారం జరిగిన పురుషుల కాంపౌండ్ విభాగంలో రాకేశ్.. ప్రిక్వార్టర్స్లోకి దూసుకెళ్లాడు. అర్హత రౌండ్లో మొత్తం 720 పాయింట్లకు గాను 699 ఖాతాలో వేసుకున్న రాకేశ్.. హంకాంగ్ ఆర్చర్ కా చ్యున్పై అధిక్యం సాధించాడు. తొమ్మిదిసార్లు 10 పాయింట్లు దక్కించుకున్న ఈ 36 ఏండ్ల ఆర్చర్ 144-131 తేడాతో చ్యున్పై విజయాన్ని అందుకున్నాడు. మంగళవారం జరిగే ప్రిక్వార్టర్స్ పోరులో మూడో సీడ్ మరియన్ మారెసక్తో తలపడుతాడు. మరోవైపు శ్యామ్సుందర్ స్వామి.. రెండో రౌండ్లోనే నిష్క్రమించి నిరాశపరిచాడు.