టోక్యో: ఒలింపిక్స్లో భారత క్రీడాకారుల విజయాలు కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం జరిగిన ఆయా మ్యాచుల్లో పీవీ సింధు, భారత హాకీ జట్టు గెలుపొందగా, ఆర్చరీ పురుషుల వ్యక్తిగత విభాగంలో అతాను దాస్ విజయం సాధించాడు. వ్యక్తిగత విభాగం రౌండ్ 32వ మ్యాచ్ చైనీస్ తైపీ ఆర్చర్ డెంగ్ యు చెంగ్పై 6-4 తేడాతో గెలిచాడు. తన తర్వాతి మ్యాచ్లో కొరియాతో అమీతుమీ తేల్చుకోనున్నాడు.
పురుషుల హాకీలో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాను భారత జట్టు మట్టికరిపించింది. నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్లో 3-1 తేడాతో ఆ జట్టును చిత్తు చేసింది. దీంతో గ్రూప్లో తానాడిన నాలుగు మ్యాచుల్లో మూడింట గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతున్నది. ఇక భారత్ తన తదుపరి మ్యాచ్ను జపాన్తో ఆడనుంది.
భారత స్టార్ షెట్లర్ పీవీ సింధు ఒలింపిక్స్ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది. డెన్మార్క్ షెట్లర్ మియా బ్లిక్ఫెల్ట్తో జరిగిన ప్రీక్వార్టర్స్లో 21-15, 21-13తో విజయం సాధించింది. దీంతో మహిళ సింగిల్స్ గ్రూప్-జేలో వరుసగా మూడు విజయాలు సాధించి క్వార్టర్స్ అర్హత సాధించింది. ఇందులో సింధు విజయం సాధిస్తే భారత్కు మరో పతకం ఖాయం కానుంది.