ఆర్చరీ: మహిళల వ్యక్తిగత అర్హత రౌండ్: దీపికా కుమారి (ఉ: 5.30 నుంచి)
పురుషుల వ్యక్తిగత అర్హత రౌండ్: అతానుదాస్, ప్రవీణ్ జాదవ్, తరుణ్దీప్రాయ్ (ఉ: 9.30 నుంచి)
న్యూఢిల్లీ : టోక్యో ఒలింపిక్స్లో భారత్ తరఫున పాల్గొంటున్న ఆటగాళ్లు పసిడి పతకం సాధిస్తే రూ.75 లక్షలు నగదు బహుమతి ఇవ్వనున్నట్టు భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) తెలిపింది. రజత పతకం సాధించినవారికి రూ.40 లక్షలు, కాంస్య పతక విజేతలకు రూ.25 లక్షలు ఇవ్వనున్నది. ఇక ఒలింపిక్స్లో భారత్ తరఫున పాల్గొనే క్రీడాకారులందరికీ లక్ష రూపాయలు ఇవ్వనున్నట్టు ఐవోఏ తెలిపింది.
టోక్యో ఒలింపిక్స్ ఆరంభ వేడుకలను కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, సహాయ మంత్రి నిశిత్ ప్రమాణిక్ ఢిల్లీలోని మేజర్ ధ్యాన్చంద్ జాతీయ స్టేడియం నుంచి వీక్షించనున్నారు. వారితో పాటు పలువురు మాజీ క్రీడాకారులు, ప్రముఖులు కూడా హాజరుకానున్నారు. విశ్వక్రీడల్లో పాల్గొనబోయే భారత ఆటగాళ్లలో జోష్ నింపనున్నారు.