భోపాల్: మతమార్పుడులకు వ్యతిరేకంగా మధ్యప్రదేశ్ రాష్ట్రం రూపొందించిన బిల్లుకు ఇవాళ ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదం తెలిపింది. పెళ్లి ద్వారా కానీ, ఇతర పద్దతుల్లో మతమార్పుడులను వ్యతిరేకించేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం కొత్త చట్టాన్ని డ్రాఫ్ట్ చేసిన విషయం తెలిసిందే. గతంలో రూపొందించిన ఆర్డినెన్స్కు ఇవాళ ఆమోదం దక్కింది. కొత్త చట్టం ప్రకారం మత మార్పిడులకు పాల్పడిన వారికి పదేళ్లు జైలుశిక్ష విధించనున్నారు. భారీ జరిమానాలు విధించే రీతిలోనూ చట్టాలను తయారు చేశారు. మధ్యప్రదేశ్ ఫ్రీడం ఆఫ్ రిలీజియన్ బిల్లును మార్చి ఒకటో తేదీన హోంశాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా అసెంబ్లీలో ప్రజెంట్ చేశారు. ఇవాళ మూజువాణీ ఓటు ద్వారా ఆ బిల్లును పాస్ చేశారు. మతమార్పుడి ఆర్డినెన్స్కు జనవరి 9వ తేదీన గవర్నర్ ఆనందీబెన్ పటేల్ పచ్చజెండా ఊపారు. కొత్త ఆర్డినెన్స్ ప్రకారం 23 కేసులు నమోదు అయినట్లు గత నెలలో మంత్రి నరోత్తమ్ తెలిపారు. భోపాల్ డివిజన్లో ఏడు, ఇండోర్లో అయిదు, జబల్పూర్లో నాలుగు, గ్వాలియర్లో మూడు కేసులు నమోదు అయినట్లు మంత్రి తెలిపారు.