నాగిరెడ్డిపేట్, మార్చి 30: జిల్లాలోని పలు సొసైటీల్లో మంగళవారం మహాజన సభలను నిర్వహించారు. ఈ సందర్భంగా సహకార సంఘాల అభివృద్ధి, రైతుల సమస్యలు, పరిష్కారంపై చర్చించి పలు తీర్మానాలు చేశారు. నాగిరెడ్డిపేట్ మండలం మాల్తుమ్మెద సొసైటీ పరిధిలో ఎరువులు, విత్తనాలను నిల్వ చేయడానికి నాలుగు గోదాములతోపాటు, శుభకార్యాల కోసం కల్యాణ మండపం నిర్మించేందుకు తీర్మానం చేశామని చైర్మన్ దుందిగల్ల నర్సింహులు తెలిపారు. మాల్తుమ్మెద శివారులో సొసైటీ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ను ఏర్పాటు చేస్తామని చైర్మన్ వివరించారు. సొసైటీ డైరెక్టర్లు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డిలో..
ఎల్లారెడ్డి సొసైటీలో చైర్మన్ ఏగుల నర్సింహులు ఆధ్వర్యంలో నిర్వహించిన మహాజన సభలో ముందుగా.. గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లావాదేవీలపై చర్చించారు. అనంతరం రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, సంఘ అభివృద్ధిపై రైతుల సమక్షంలో చర్చించారు. పాలకవర్గ సభ్యులు, సర్పంచులు, సొసైటీ కార్యదర్శి విశ్వనాథం, సిబ్బంది పాల్గొన్నారు.
హమాలీ చార్జీలను చెల్లించాలి..
మండల పరిధిలోని దేమెకలాన్ విండో మహాజన సభను చైర్మన్ రాజశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. హమాలీ చార్జీలను వెంటనే చెల్లించాలని సమావేశంలో తీర్మానించారు. మక్క, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, దీర్ఘకాలిక రుణాలు తీసుకున్న రైతులకు సబ్సిడీ ఇవ్వాలని ఈ సందర్భంగా రైతులు కోరారు. విండో వైస్ చైర్మన్ రవీందర్రెడ్డి, డైరెక్టర్లు రాజన్న, ప్రకాశ్రెడ్డి, నర్సారెడ్డి, కార్యదర్శి భూపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సంఘం అభివృద్ధికి సహకరించాలి..
మండలంలోని బుడ్మి సహకార సంఘం సమావేశాన్ని చైర్మన్ పిట్ల శ్రీధర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి సంఘం అభివృద్ధికి సహకరించాలని కోరారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక చొరవతో విండో పరిధిలోని రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలను అందజేస్తున్నామని తెలిపారు. ముందుగా సంఘం ఆదాయ, వ్యయాలను సభకు వివరించారు. వైస్ చైర్మన్ మధుసూదన్రెడ్డి, గంగుల గంగారాం, గోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
లాభాల బాటలో బాన్సువాడ సొసైటీ..
బాన్సువాడ, మార్చి 30: స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కృషితో బాన్సువాడ సొసైటీ లాభాల బాటలో పయనిస్తున్నదని చైర్మన్ ఏర్వాల కృష్ణారెడ్డి తెలిపారు. పట్టణంలోని సొసైటీ ఆవరణలో నిర్వహించిన మహాజన సభలో సంఘ ఆదాయ, వ్యయాలను కార్యదర్శి నారాయణరెడ్డి చదివి వినిపించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ.. సొసైటీ బ్యాంకు ఖాతాలో రూ. కోటీ 32 లక్షలు, ఎస్జీ అకౌంట్లో రూ. 20 లక్షలు జమ ఉన్నట్లు చెప్పారు. సొసైటీ కోసం కొత్త భవనానికి స్పీకర్ పోచారం రూ. 40 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. అనంతరం సొసైటీ పాత కార్యాలయాన్ని, గోదామును తొలగించేందుకు తీర్మానం చేశారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ పరిగె మంజు జనార్దన్రెడ్డి, డైరెక్టర్లు సాయిలు, సంతోష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సహకార భవనాలు నిర్మించాలి..
మండలంలోని రాంపూర్లోని విండో భవనంలో విండో చైర్మన్ శపథంరెడ్డి అధ్యక్షతన సొసైటీ మహాజనసభ నిర్వహించారు. సభలో ఆదాయ వ్యయాలు, వార్షిక నివేదికను చదివి వినిపించారు. సొసైటీ పరిధిలోని బండపల్లి, పిట్లం, రాంపూర్ గ్రామాల్లో సహకార భవనాలు నిర్మించాలని, జొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని తీర్మానించారు. సర్పంచ్ నారాయణరెడ్డి, సీఈవో సంతోష్రెడ్డి, విండో డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.
పుల్కల్ సొసైటీలో..
మండలంలోని పుల్కల్ గ్రామంలో విండో కార్యాలయ ఆవరణలో సొసైటీ చైర్పర్సన్ ఇందిరాప్రహ్లాద్ అధ్యక్షతన మహాజన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వరి ధాన్యాన్ని సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తామని చెప్పారు. సొసైటీ అభివృద్ధికి రైతుల సహకారంతో తనవంతు కృషి చేస్తానన్నారు. ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు సిద్ధిరామ్ పటేల్, సొసైటీ ఉపాధ్యక్షుడు రామ్రెడ్డి, కార్యదర్శి సాయికుమార్, డైరెక్టర్లు పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి..
కూ యాప్ ఏమిటి? మంత్రులు ఎందుకు చేరారు?
లైంగిక భాగస్వామికి చప్పట్లతో సంకేతం.. సీల్స్పై అధ్యయనంలో వెల్లడి!