న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్కు తాను సిద్ధంగా ఉన్నానని భారత స్టార్ సానియా మీర్జా చెప్పింది. టోక్యో గేమ్స్లో బరిలోకి దిగనుండడంతో నాలుగుసార్లు ఒలింపిక్స్లో ఆడిన తొలి భారత మహిళా అథ్లెట్గా సానియా కొత్త చరిత్ర సృష్టించనుంది. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్ వెబ్సైట్కు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చింది. శక్తి సామర్థ్యాలను నమ్ముకుంటూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతాను అంది. కాగా వికింగ్ టోర్నీలో సానియా పోరు ఆదిలోనే ముగిసింది.