పారిస్: గ్రాండ్స్లామ్ టోర్నీ మెయిన్డ్రాకు చేరాలని లక్ష్యంగా పెట్టుకున్న భారత ప్లేయర్లు అంకిత రైనా, రామ్కుమార్ రామ్నాథన్కు మరోసారి నిరాశఎదురైంది. ఫ్రెంచ్ ఓపెన్ క్వాలిఫయర్స్ రెండో రౌండ్లో ఓడిన ఇద్దరూ టోర్నీ నుంచి నిష్క్రమించారు. బుధవారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో అంకిత 2-6, 0-6 తేడాతో గ్రీట్ మినెన్ (జర్మనీ) చేతిలో ఓడింది. పురుషుల సింగిల్స్లో రామ్నాథన్ 1-6, 2-6 తేడాతో డెనిస్ ఇస్టోమిన్పై కనీసపోరాటం లేకుండానే పరాజయం పాలయ్యాడు.