న్యూఢిల్లీ: భారత ఫుట్బాల్ జట్టు ఆటగాడు అనిరుధ్ థాపా కరోనా వైరస్ బారిన పడ్డాడు. టీమ్తో పాటు ఖతార్ పర్యటనకు వెళ్లిన థాపాను దోహాలోని ఓ హోటల్లో క్వారంటైన్లో ఉంచారు. ప్రపంచకప్, ఆసియా కప్ సంయుక్త క్వాలిఫయర్స్ పోటీల కోసం ప్రస్తుతం టీమ్ఇండియా దోహాలో ఉంది. బుధవారం ఖతార్తో జరిగిన మ్యాచ్లో 0-1తో భారత్ ఓడిపోయాక.. నిర్వహించిన కరోనా పరీక్షల్లో థాపాకు పాజిటివ్గా తేలింది. ఈ విషయాన్ని అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) ప్రధాన కార్యదర్శి కుశాల్ దాస్ వెల్లడించారు.