న్యూఢిల్లీ: భారత అగ్రశ్రేణి గోల్ఫర్ అనిర్బన్ లహిరి వరుసగా రెండోసారి ఒలింపిక్స్కు అర్హత సాధించాడు. మంగళవారం విడుదలైన టోక్యో గేమ్స్ ర్యాంకింగ్స్లో 60వ స్థానం సాధించిన అనిర్బన్ విశ్వక్రీడల బెర్త్ దక్కించుకున్నాడు. ఒలింపిక్స్ గోల్ఫ్లో భారత్కు ఓ స్థానం పక్కా కాగా.. దేశం తరఫున టాప్లో ఉన్న అతడికి అవకాశం దక్కింది. ప్రస్తుతం గోల్ఫ్ ప్రపంచ ర్యాంకింగ్స్లో అనిర్బన్ 340వ స్థానంలో ఉన్నాడు. భారత్ తరఫున మరోసారి ఒలింపిక్స్లో ఆడనుండడం ఎంతో సంతోషంగా ఉందని అనిర్బన్ ట్వీట్ చేశాడు.