న్యూఢిల్లీ: భారత చెస్ దిగ్గజం, గ్రాండ్మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ స్పార్కసన్ ట్రోఫీని చేజిక్కించుకున్నాడు. చివరి రౌండ్లో వ్లాదిమర్ క్రామిక్ (రష్యా)తో పోరును ‘డ్రా’ చేసుకున్న విశ్వనాథన్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన ఆఖరి పోరును 40 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్న ఆనంద్.. 2.5 పాయింట్లతో ట్రోఫీ కైవసం చేసుకున్నాడు. ఈ టోర్నీలో తొలి రౌండ్లో విజయం సాధించిన ఆనంద్.. ఆ తర్వాతి మూడు రౌండ్లను ‘డ్రా’ చేసుకున్నాడు.